దేశవ్యాప్తంగా నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మొత్తం 8 రాష్ట్రాల్లోని 71 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలోని 17, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ల్లో 13 చొప్పున, పశ్చిమబెంగాల్లో 8, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో 6 చొప్పున, బిహార్లో 5, జార్ఖండ్లోని 3 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. వీటితో పాటు జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ నియోజకవర్గంలో రెండో దశ పోలింగ్ జరగనుంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్పెద్దర్ రోడ్లోని పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిల్చుని ఓటు వేశారు.
ప్రముఖ వ్యాపార వేత్త అనిల్ అంబానీ ముంబై కఫ్పే పెరడ్లోని జీడీ సోమని స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధర రాజే సింధియా జల్వార్లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై నార్త్ సెంట్రల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి పూనమ్ మహాజన్ ఓర్లిలోని బూత్ నెం48లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.