Tata Group: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి

Cyrus Mistry: బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి చెందారు.

Update: 2022-09-04 11:32 GMT

Tata Group: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి 

Cyrus Mistry: బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతిచెందారు. ముంబై దగ్గర్లోని ఫాల్ఘర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ కన్నుమూశారు. అతివేగంతో వచ్చిన కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ గా ఉన్న సమయంలో రతన్ టాటాతో విభేదించి బాధ్యతల నుంచి వైదొలిగారు. ప్రస్తుతం షాపూంజీ, పల్లోంజీ సంస్థల ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు మిస్త్రీ మరణం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది.

Tags:    

Similar News