రోడ్డు ప్రమాదం : ఒకదానికొకటి ఢీ కొన్న మొత్తం 15 వాహనాలు

Update: 2021-02-13 09:00 GMT

రోడ్డు ప్రమాదం : ఒకదానికొకటి ఢీ కొన్న మొత్తం 15 వాహనాలు 

ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా- లక్నో జాతీయ రహదారిపై పొగ మంచు కారణంగా దారి కనిపించకపోవడంతో ఒకదానికొకటి మొత్తం 15 వాహనాలుఢీ కొన్నాయి. కొన్ని వాహనాలు ఒకదానిపై మరొకటి ఎక్కాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు గాయపడ్డవారిని సమీప ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో ముందుగా ఒక బస్సు, బొలేరేను ఢీ కొట్టింది. బస్సులోని ప్రయాణికులు వెంటనే కిందకు దిగి రోడ్డుపై వెళుతున్న వాహనాలవారిని అలర్ట్ చేశారు. ముందుకెళ్లవద్దని గట్టిగా అరుపులు అరిచారు. దీంతో పలు వాహనాలు రోడ్డు ప్రమాదం బారి నుంచి తప్పించుకున్నాయి.

Tags:    

Similar News