వారణాశిలోని విశ్వనాథ్ ధామ్ వార్షికోత్సవ సంబరాలు
* శీవిశ్వేశ్వరుని సన్నిధిలో వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Varanasi: వారణాశిలోని విశ్వనాథ్ ధామ్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కాశీవిశ్వేశ్వరుని సన్నిధిలో వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారణాశి క్షేత్రంలో విశ్వేశ్వరుని వైభవాన్ని భక్త ప్రపంచానికి చాటేవిధంగా ప్రత్యేక ధామ్ను ఏర్పాటు చేశారు. గంగానది తీరాన ఉన్న లలిత, జలసేన్, మణికర్ణిక ప్రాంతాలను కలిపి విశ్వనాథ్ ధామ్గా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. కాశీక్షేత్రానికి వచ్చే భక్తులు విశ్వనాథ్ ధామ్ను సందర్శించే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లుచేసింది. వార్షికోత్సవ సందర్భంగా మందిరాన్ని రకరకాల పూలతో అలంకరించారు. వార్షికోత్సవ పూజల్లో భక్తులు సామూహికంగా నిర్వహించారు.