Mumbai: అటల్‌ సేతుపై మొదటి ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

Mumbai: డ్యాష్‌కామ్‌లో రికార్డయిన ప్రమాద దృశ్యాలు

Update: 2024-01-22 12:30 GMT

Mumbai: అటల్‌ సేతుపై మొదటి ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

Mumbai: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో నూతనంగా నిర్మించిన ‘అటల్‌ సేతు’పై తొలి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సహా చిన్నారులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ముంబై నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని చిర్లేకు వెళుతున్న ఓ కారు... అటల్‌ సేతుపైకి చేరుకోగానే.. ముందు వెళుతున్న మరో వాహనాన్ని దాటేందుకు యత్నించింది. దీంతో అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు.

ప్రమాదం తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే వాహనం సముద్రంలో పడేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన మొత్తం వంతెనపై వెళుతున్న మరో కారు డ్యాష్‌కామ్‌లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అటల్‌ సేతు ప్రారంభించిన తర్వాత ఇదే తొలి ప్రమాదమని అధికారులు తెలిపారు. గాయపడిన మహిళలు, చిన్నారులను ముంబై ట్రాఫిక్‌ పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News