ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
ముంద్క ప్రాంతంలోని ఓ గోదాములో చెలరేగిన మంటలు, 21 ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది.
దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ముంద్క ఏరియాలోని ఓ గోదాంలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ గోదాంకు ఎదురుగా ఉన్న బల్బుల ఫ్యాక్టరీకి మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు 21 ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి.
అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే ఢిల్లీలోని అనాజ్మండీలో బ్యాగ్, పేపర్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి 43 మంది సజీవదహనమయ్యారు. 62 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మరువక ముందే మరో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.