ఫణి తుపాన్ ఆదివారం కంటే సోమవారం మరింత బలపడిందని.. మంగళవారానికి పెను తుపాన్గా మారే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. మే 1 నుంచి ఏపీ తీరానికి దూరంగా ప్రయాణిస్తుందని, నాలుగో తేదీన తుపాన్ ఒడిశా తీరానికి దగ్గరగా వస్తుందని అయన ప్రకటించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఫణి తుపాన్ ప్రభావం తక్కువేనని, తుపాన్ తీరం వెంబడి ప్రయాణించడం వల్ల ఏపీలోని విశాఖ, శ్రీకాకుళం, మచిలీపట్నంలో వర్షం పడే అవకాశం ఉందని రమేశ్ తెలిపారు.