PM Modi Scheme: మోదీ పథకం పేరుతో మోసం.. రోజుకు 10,000 రూపాయలు సంపాదించవచ్చా?
PM Modi Scheme: ప్రధాని మోదీ కొత్త పథకం కింద రోజుకు 10,000 రూపాయలు సంపాదించవచ్చని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే, ఇది పూర్తిగా అవాస్తవమని, ఈ వార్తను ప్రభుత్వ సంస్థ పీఐబీ స్వయంగా ఖండించింది.
PM Modi Scheme: ప్రధాని మోదీ కొత్త పథకం కింద రోజుకు 10,000 రూపాయలు సంపాదించవచ్చని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే, ఇది పూర్తిగా అవాస్తవమని, ఈ వార్తను ప్రభుత్వ సంస్థ పీఐబీ స్వయంగా ఖండించింది.
పీఐబీ ఫ్యాక్ట్ చెకింగ్ టీమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోస్ట్ను షేర్ చేసింది. ఆ పోస్ట్ ప్రకారం మోసపూరిత వెబ్సైట్లు తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఏటీఎంల వద్ద భారీ క్యూలు ఏర్పడ్డాయని, దీని ద్వారా ప్రజలు రోజుకు 10,000 రూపాయలు సంపాదించవచ్చని, వేలాది మంది భారతీయులు మొదటి నెలలోనే 80,000 రూపాయల నుండి 3,50,000 రూపాయల వరకు సంపాదించారని ఆ వెబ్సైట్లు పేర్కొంటున్నాయి. అయితే, ఈ పోస్ట్ను పీఐబీ పూర్తిగా తప్పు అని తేల్చేసింది.
ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు
ప్రభుత్వం అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని పీఐబీ తన పోస్ట్లో స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు పోస్ట్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా, కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలని సూచించింది.
1. ప్రభుత్వ ఉద్యోగం, సబ్సిడీ ఇస్తామని చెప్పే వెబ్సైట్లు ప్రభుత్వ వెబ్సైట్లా కనిపిస్తే, వాటిని ఒకసారి సరిచూసుకోండి.
2. దీని కోసం మీరు ఏదైనా ప్రభుత్వ పోర్టల్ను సంప్రదించవచ్చు లేదా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ @PIBFactCheck కు ట్వీట్ చేయవచ్చు.
3. ‘.gov.in’ ఎక్స్టెన్షన్ ఉన్న వెబ్సైట్లు మాత్రమే అసలైన ప్రభుత్వ వెబ్సైట్లు. ‘.in’ లేదా ‘.org’ ఎక్స్టెన్షన్ ఉన్న ఇతర సైట్లు ప్రభుత్వ వెబ్సైట్లుగా కనిపిస్తే, వాటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి.
4.‘అశోక్’ లేదా ‘స్వచ్ఛ భారత్’ వంటి అధికారిక చిహ్నాలు ఉన్న వెబ్సైట్లు ప్రభుత్వ సైట్లు కానవసరం లేదు. కాబట్టి, ఆ సైట్లను తప్పనిసరిగా పరిశీలించండి.