Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
Chhattisgarh: పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు
Chhattisgarh: ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. బాసగూడ పీఎస్ పరిధిలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధి, చిప్పూర్ భట్టి ప్రాంతంలోని తాల్పేరు నది ఒడ్డున ఎన్కౌంటర్ జరిగిందని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.