సీనియర్ పొలిటీషియన్ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత, శరద్ పవార్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. శరద్ పవార్తో పాటు ఆయన మేనల్లుడు అజిత్ పవార్పై కూడా ఈడీ కేసు నమోదు చేసింది. మహారాష్ట్ర స్టేట్ కోపరేటివ్ బ్యాంక్ సంబందించిన స్కామ్లో వీరిపై కేసులు నమోదు చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది.