Delhi Liquor Scam: అరుణ్‌ పిళ్లైని అరెస్ట్‌ చేసిన ఈడీ

Delhi Liquor Scam: లిక్కర్‌ పాలసీ రూపకల్పనలో ముఖ్యపాత్ర ఉందని ఆరోపణలు

Update: 2023-03-07 06:23 GMT

Delhi Liquor Scam: అరుణ్‌ పిళ్లైని అరెస్ట్‌ చేసిన ఈడీ

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే గోరంట్ల బుచ్చిబాబుతో సహా పలువురిని అరెస్ట్ చేశారు. ఇక తాజాగా ఈ కేసులో ఈడీ మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 2 రోజుల పాటు పిళ్ళైని విచారించిన అధికారులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం అరుణ్‌పిళ్లైను సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన అధికారులు తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం అతను జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఇవాళ తీహార్ జైల్లోనే మనీష్ సిసోడియాను అధికారులు విచారించనున్నారు. అయితే ఈ విచారణలో అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. దానికి సిసోడియా ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. 


Full View


Tags:    

Similar News