Mpox: దేశంలో మళ్ళీ మంకీపాక్స్ కలకలం.. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్
Mpox: దేశంలో మళ్ళీ మంకీపాక్స్ కలకలం.. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్
Mpox: దేశంలో మళ్లీ మంకీపాక్స్ కలకలం రేపుతోంది. ఇటీవల దుబాయ్ నుంచి తిరిగివచ్చిన 40ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ గా తేలింది. కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా కర్కాలకు చెందిన వ్యక్తి 19ఏళ్లుగా దుబాయ్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 17న మంగళూరుకు వచ్చాడు. అనంతరం ఆయన శరీరంపై దద్దుర్లు రావడంతో స్వల్పంగా జ్వరం కూడా వచ్చింది. దీంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అనుమానం వచ్చిన వైద్యులు అతని శాంపిల్స్ తీసుకుని పూణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ఈ క్రమంలోనే నమూనాలను పరీక్షించిన వైద్యులు మంకీపాక్స్ గా నిర్ధారించినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగానే ఉందని త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉందని వైద్య శాఖ పేర్కొంది. ఈ ఏడాది దేశంలో వెలుగు చూసిన మొదటి మంకీ పాక్స్ కేసు ఇదే. గత ఏడాది ఈ వ్యాధి తీవ్ర అందోళన కలిగిన సంగతి తెలిసిందే.