కర్ణాటక మాజీ మంత్రి డీకే శివ కుమార్కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఈరోజు ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో ఈడీ అధికారులు బెంగళూరులోని ఆర్ఎల్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పూర్తైన అనంతరం తిరిగి ప్రత్యేక కోర్టుకు తీసుకెళ్లారు ఈడీ అధికారులు. అయితే శివ కుమార్ అభిమానులు పెద్ద ఎత్తున హాస్పిటల్కి చేరుకోవడంతో పోలీసులకు అభిమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ వేణుగోపాల్ను అధికారులు హాస్పిటల్లోకి అనుమతించలేదు.