కాంగ్రెస్ సీనియర్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఉచ్చు బిగుస్తోంది. ఎయిరిండియా విమానాల కొనుగోలు స్కామ్ కేసులో దారులన్నీ మూసుకుపోతున్నాయి. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో చిదంబరం సుప్రీం బాటపట్టారు. చిదంబరం తరపున కపిల్ సిబల్, అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించనున్నారు.