Delhi Election Results 2025: బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ ఎలా కారణమైంది?
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు విడి విడిగా పోటీ చేయడం పరోక్షంగా బీజేపీకి కలిసి వచ్చింది.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు విడి విడిగా పోటీ చేయడం పరోక్షంగా బీజేపీకి కలిసి వచ్చింది. చాలా స్థానాల్లో ఆప్ అభ్యర్థులు వెయ్యి నుంచి రెండు వేలలోపు ఓట్లతో ఓడిన స్థానాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఈసారి 6 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఇది పరోక్షంగా బీజేపీ గెలుపునకు కలిసి వచ్చింది.
ఇండియా కూటమిలోనే కాంగ్రెస్, ఆప్ ఉన్నాయి. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈ రెండు పార్టీలు విడి విడిగా పోటీ చేశాయి. ఇది బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చాయి. ఇది పరోక్షంగా కమలం పార్టీకి కలిసి వచ్చింది. కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తే ఆప్ కనీసం 15 సీట్లలో గెలిచి ఉండేది. కాంగ్రెస్ చీల్చిన ఓట్లను కలిపితే ఆప్ అభ్యర్ధులు గెలిచేవారు.
రాజేంద్రనగర్, ఛత్తాపూర్, సంగం విహార్, గ్రేటర్ కైలాష్ వంటి నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థుల ఓటమికి పరోక్షంగా కాంగ్రెస్ కారణమైంది. రాజేంద్రనగర్ లో ఆప్ అభ్యర్ధికి 45,440 ఓట్లు వచ్చాయి. ఇదే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధికి 4,015 ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు కలిపితే 49,455 కు చేరుతాయి. అదే జరిగితే ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఓటమి ఖాయమే.
కాంగ్రెస్ చీల్చిన ఓట్లతో బీజేపీ గెలుపు సాధించిన నియోజకవర్గాలు
| నియోజకవర్గం పేరు | గెలిచిన పార్టీ | మెజార్టీ | కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు |
సంగం విహార్ | బీజేపీ గెలుపు | 344 | 15863 |
| రాజేంద్రనగర్ | బీజేపీ గెలుపు | 1231 | 4015 |
| త్రిలోక్ పురి | బీజేపీ గెలుపు | 392 | 1147 |
| బద్లీ | బీజేపీ గెలుపు | 6589 | 26,359 |
| మాల్వియానగర్ | బీజేపీ గెలుపు | 2031 | 6770 |
| జంగాపుర | బీజేపీ గెలుపు | 675 | 7350 |
| న్యూదిల్లీ | బీజేపీ గెలుపు | 4049 | 4541 |
| యుకెహెచ్ | బీజేపీ గెలుపు | 3039 | 6677 |
| తిమర్పూర్ | బీజేపీ గెలుపు | 316 | 5754 |
| నంగ్లోయ్ | బీజేపీ గెలుపు | 26251 | 32028 |
10 ఏళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ 70 నియోజకవర్గాల్లో హస్తం పార్టీ తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేసింది. ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. గెలవకున్నా కూడా ఆప్ ఓటమికి కాంగ్రెస్ కారణమైంది. దిల్లీలో ఆ పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలపడేందుకు ఈ ఎన్నికలు హస్తం పార్టీకి కలిసి వచ్చాయి.