కరోనా రెడ్‌జోన్‌: గుంపులుగా రథాన్ని లాగారు!

Update: 2020-04-17 09:04 GMT

రథోత్సవం సందర్భంగా భక్తులు లాక్‌డౌన్‌ నిబంధనలు తుంగలో తొక్కారు. దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలో నిర్వహించిన వార్షిక రథోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన రథోత్సవంలో 100 నుంచి 150 మంది పాల్గొని రథాన్ని లాగారు.

దాదాపు 20 నిముషాలపాటు రథోత్సవం సాగిందని, లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని 20 మందికిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ లడ మార్టిన్ తెలిపారు. ఇప్పటికే కలబురిగి ప్రాంతాన్ని హాట్ స్పాట్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. అయినా లెక్క చేయకుండా ఆలయ నిర్వాహకులు రథోత్సవం చేపట్టారు. దీనిపై ఎస్పీ మార్టిన్ మార్బనియాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News