సెలవులపై ఇళ్ళకు వెళ్ళే జవాన్లకు హెలికాప్టర్‌ సౌకర్యం..

Update: 2021-02-27 15:41 GMT

సెలవులపై ఇళ్ళకు వెళ్ళే జవాన్లకు హెలికాప్టర్‌ సౌకర్యం..

సెలవులపై ఇళ్ళకు వెళ్ళే CRPF జవాన్ల క్షేమం కోసం కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పుల్వామా ఉగ్రదాడుల తర్వాత తప్పనిసరిగా కేంద్రం వారి భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. సెలవులపై వెళ్ళే జవాన్లను హెలికాప్టర్‌ ద్వారా వారి గమ్య స్థానాలకు చేర్చాలని హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉగ్రవాద దాడులతో పాటు ఐఈడీ పేలుళ్ళ నుంచి వారికి రక్షణ కల్పించేందుకు ఈ సౌకర్యాన్ని అమలులోకి తెచ్చింది. చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ అంశాన్ని కేంద్రం తాజాగా ఆమోదించింది.

Tags:    

Similar News