ముంబై, ఢిల్లీలో పెరిగిన పాజిటివ్ కేసులు..

ముంబైలో కొత్తగా 1,150 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 53 మరణాలు సంభవించాయి.

Update: 2020-06-05 16:48 GMT

ముంబైలో కొత్తగా 1,150 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 53 మరణాలు సంభవించాయి. దీంతో ముంబైలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45,854 కి చేరుకుంది.. అలాగే మరణాల సంఖ్య 1,518 గా ఉందని మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ ముంబై తెలిపింది. మహారాష్ట్ర కేసులు 77,000 దాటాయి. ఇక దేశ ఢిల్లీలో శుక్రవారం కొత్తగా 1,330 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, దీంతో జాతీయ రాజధానిలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26,334 గా ఉంది.

మరణాలు 708 గా ఉన్నాయి. ప్రస్తుతం 15,311 క్రియాశీల కేసులు ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఇక వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రకటించిన గణాంకాల ప్రకారం, శుక్రవారం రాత్రి 9.50 నాటికి, దేశవ్యాప్తంగా 2,17,389 కేసులు , మరణాల సంఖ్య 6,233 గా నమోదైంది. ఇప్పటివరకు కోలుకున్న వారికి సంఖ్య 1.07 లక్షలకు పైగా ఉంది.

Tags:    

Similar News