ముంబైలో భారీగా పెరిగిన కరోనా కేసులు

Update: 2020-06-03 15:52 GMT

మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కరోనాకు అత్యంత ఎక్కువగా ప్రభావితమైన ముంబైలో అయితే కేసులు సంఖ్య మరోసారి పెరిగింది. ముంబైలో కొత్తగా 1,276 పెరిగి మొత్తం 43,262 కు చేరుకున్నాయి.. అలాగే కొత్తగా 49 మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,417 వరకు పెరిగిందని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.

మరోవైపు మహారాష్ట్రలో 2,560 కొత్త కేసులు రావడంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74,860 కు పెరిగింది. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో అత్యధికంగా 8,909 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య కూడా 5,815 కు పెరిగింది. 101,497 క్రియాశీల కేసులుండగా, 100,303 రికవరీలతో సహా దేశంలో ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 207,615 గా ఉంది.


Tags:    

Similar News