మహారాష్ట్రలో కొత్తగా 3007 కేసులు.. 91 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది.
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 3007 పాజిటివ్ కేసులు, 91 మరణాలు సంభవించాయి. దీనితో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 85,975కి చేరింది. ఇప్పటివరకు 3,060 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 43,591గా ఉందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
భారత్లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో 9971 కేసులు నమోదు కాగా, 287 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2,46,628 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,20,406 ఉండగా, 1,19,292 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 6929 మంది వ్యాధితో మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. గడచిన 24 గంటలలో నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 1,42,069. దేశంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 46,66,386. భారత్ లో 48.02 గా కరోనా రికవరీ రేటు.