కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా దేశంలో మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.

Update: 2020-05-09 14:18 GMT
Representational Image

కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా దేశంలో మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 1991 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 9 రోజుల్లో 911 మంది మరణించారు. శనివారం సాయంత్రం నాటికి 7 మరణాలు నిర్ధారించబడ్డాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, చండీగర్‌లో కొత్తగా మరణాలు సంభవించాయి.

మహారాష్ట్రలో అత్యధికంగా మరణాల సంఖ్య 700 దాటింది. ఇప్పటివరకు ఇక్కడ 731 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైలో మాత్రమే 462 కరోనా రోగులు మరణించారు. గుజరాత్‌లో మృతుల సంఖ్య ఇక్కడ కూడా 449 కు పెరిగింది. పశ్చిమ బెంగాల్‌లో తాజా లెక్కలతో మరణించిన వారి సంఖ్య 160 కి చేరుకుంది.. కాగా శుక్రవారం ఒక్కరోజే 94 మంది మరణించారు, మహారాష్ట్రలో అత్యధికంగా 37 మంది మరణించారు. ఇందులో ముంబై నుండి 25 మంది ఉన్నారు.


Tags:    

Similar News