గుజరాత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న గుజరాత్లో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 492 పాజిటివ్ కేసులు, 33 మరణాలు సంభవించాయి. దీనితో గుజరాత్లో కరోనా కేసుల సంఖ్య 18,601కి చేరింది. ఒక్క అహ్మదాబాద్లోనే 291 కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు 1,155 మంది మృత్యువాతపడ్డారు.
భారత్లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో 9,304 కేసులు నమోదు కాగా, 260 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2,16,919 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,06,737 ఉండగా, 1,04,107 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా, 6,075 మంది వ్యాధితో మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.