భారత్లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 258 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్లో 21 రాష్ట్రాలకు ఈ వైరస్ విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 53 కరోనా కేసులు నమోదవ్వగా కేరళలో 40, యూపీలో 23, తెలంగాణలో 19, రాజస్థాన్లో 17, ఢిల్లీలో 17, కర్ణాటక 16, లడఖ్ 10, ఏపీలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ కట్టడికి ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి జనాత కర్ఫ్యూనకు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి.