Coronavirus In Indian Villages: గ్రామాల్లో కరోనా వ్యాప్తికి కారణాలు ఇవేనా?

Coronavirus In Indian Villages: ఈ రోజుకు రెండు నెలల ముందు, ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు

Update: 2020-07-18 07:27 GMT
Coronavirus In Indian Villages Uttarpradesh, Bihar, Rajasthan, Madhyapradesh,

Coronavirus In India Village: ఈ రోజుకు రెండు నెలల ముందు, ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. ఈ సంభాషణలో మోడీ చాలా ఆందోళన వ్యక్తం చేసిన విషయం ఏమిటంటే గ్రామాల్లో కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఇదే మన ముందున్న పెద్ద సవాలు అని మోదీ అన్నాయి రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చెప్పారు. ముఖ్యమంత్రిలతో ఈ సమావేశం మే 11 న జరిగింది. ఈ సమావేశానికి రెండు నెలలకు పైగా గడిచిపోయింది. కరోనావైరస్ కేసుల సంఖ్య కూడా 1 మిలియన్లను దాటింది. ఈ తరుణంలో గ్రామాలకు కూడా కరోనా వైరస్ పాకింది. అయితే ఇది ఎలా ప్రసారం అయిందనే దానికి కారణాలు ఇలా ఉన్నాయంటున్నారు నిపుణులు.

వలస కూలీల ద్వారా గ్రామాల్లో వైరస్ సంక్రమణ ఎక్కువగా ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు. అలాగే వలస కార్మికులను వారి సొంత గ్రామానికి తీసుకురావడానికి, ప్రభుత్వం శ్రామిక రైళ్లను ప్రారంభించింది, ఇందులో సామాజిక దూరం పేరుకైతే ఉండాలని సూచించింది.. కానీ రైలు 90% మంది ప్రయాణికులు ఉన్నప్పుడే రైలు నడుస్తుందని రైల్వే మార్గదర్శకంలో స్పష్టంగా ఉంది. ఒక రైలులో 90% మంది ప్రయాణికులు ఉంటే, సామాజిక దూరాన్ని అనుసరించడం అసాధ్యం. అటువంటి పరిస్థితిలో కరోనా ఎక్కువమందికి సోకె ప్రమాదం ఉందని అన్నారు నిపుణులు.

తొలుత వలస కార్మికులను దిగ్బంధం కేంద్రంలో ఉంచారు. ఆ తరువాత రైళ్లు లేదా బస్సుల ద్వారా వారిని తరలించి.. వారి సొంత ప్రదేశాలలో నిర్బంధ కేంద్రాలలో ఉంచారు. అయితే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే కొందరు కార్మికులు మరియు ప్రజలు తమ సొంత మార్గాల ద్వారా తమ ఇళ్లకు, గ్రామాలకు ముందే చేరుకున్నారు. వారిలో కొందరు దిగ్బంధం కేంద్రంలో లేరు, చాలా మంది గ్రామానికి నేరుగా వెళ్లారు. అలాంటి వ్యక్తులపై నిఘా లేకపోవడం వలన కూడా గ్రామాల్లో కరోనా వ్యాప్తి జరిగి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాగా భారతదేశ జనాభాలో 68% కంటే ఎక్కువ మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని గ్రామాల్లో 83.30 కోట్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. అయితే, నగరాల్లో కేవలం 37.71 కోట్ల జనాభా మాత్రమే నివసిస్తున్నారు. దేశంలోని పది రాష్ట్రాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఇక్కడ దేశ జనాభాలో 74% కంటే ఎక్కువ మంది నివసిస్తున్నారు. ఈ రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోని మొత్తం జనాభాలో 87.29 కోట్లలో 61.94 కోట్ల జనాభా గ్రామాల్లో నివసిస్తున్నారు. అంటే, దేశంలోని మొత్తం జనాభాలో 74.36 శాతం జనాభా ఈ 10 రాష్ట్రాల్లో నివసిస్తున్నారు.

c

Tags:    

Similar News