భారత్ లో 50 వేలకు చేరిన కరోనా కేసులు..
భారత్ లో ధృవీకరించబడిన కోవిడ్ -19 కేసులు బుధవారం 50,000 కి చేరుకున్నాయి, అనేక పెద్ద పట్టణ కేంద్రాలు వైరస్ సంక్రమణ భారిన పడ్డాయి.
భారత్ లో ధృవీకరించబడిన కోవిడ్ -19 కేసులు బుధవారం 50,000 కి చేరుకున్నాయి, అనేక పెద్ద పట్టణ కేంద్రాలు కొరోనావైరస్ క్రమణ భారిన పడ్డాయి.చాలా మంది ఆరోగ్య నిపుణులు , భద్రతా సిబ్బందికి కూడా పాజిటివ్ పరీక్షలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలతో సహా కొన్ని రాష్ట్రాల్లో అధిక మరణాల రేటును అధికారులు వెల్లడించారు. ఒకేరోజు మహారాష్ట్ర రికార్డు స్థాయిలో 1,200 కంటే ఎక్కువ కేసులను నమోదు చేసింది. దాంతో అక్కడ ప్రస్తుతం 15525 కేసులున్నాయి. మరోవైపు గుజరాత్ రోజులో 380 కొత్త కేసులు , 28 మరణాలు నమోదయ్యాయి, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,625, మరణాల సంఖ్య 396 గా ఉంది.
కరోనా భారీనుండి కేరళ రాష్ట్రం దాదాపు కోలుకున్నట్టుగానే అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ పాత కేసులు మినహా కొత్త సంక్రమణలు ఏవి బయటపడలేదు.. , గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ,పంజాబ్ రాష్ట్రాల్లో వైరస్ కేసులు కొత్తవి నమోదు అవుతూనే ఉన్నాయి.