Corona Effect: నాలుగు నిమిషాల్లో పెళ్లి చేసిన కరోనా!

Update: 2020-03-28 05:17 GMT

పెళ్లంటే నూరేళ్ల పంట బంధు మిత్రులు, భాజాభజంత్రిలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కాని కరోనా భయం ఓ వివాహాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తిచేయించింది.పెళ్లికి బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తే కరోనా సోకే ప్రమాదం ఉందనే భయం ఫలితంగానే వారి పెళ్లి నిమిషాల వ్యవధిలో ముగిసిపోయింది.

నాలుగంటే నాలుగు నిమిషాల్లో మాంగల్యం తంతునానేనా అంటూ మమ అనిపించిన వ్యవహారం కర్ణాటకలోని కూడ్లిగి తాలూకా సిద్ధాపురంలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన రోహిణి (20), మధు (25) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించడంతో ముహూర్తం నిర్ణయించారు. అయితే, ఈలోపు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో వారికి ఏం చేయాలో పాలుపోలేదు. శుక్రవారం ఉదయం కూడ్లిగి సమీప మలియమ్మదేవి ఆలయంలో నాలుగు నిమిషాల్లో పెళ్లి ముగించారు. 

Tags:    

Similar News