దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. 24 గంటల్లో 412 కేసులు నమోదు, ముగ్గురు మృతి

India: దేశ వ్యాప్తంగా కేసుల నమోదుతో ప్రజల్లో భయాందోళన

Update: 2023-12-26 05:05 GMT

దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. 24 గంటల్లో 412 కేసులు నమోదు, ముగ్గురు మృతి

India: భారత్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 412 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దేశ వ్యాప్తంగా 4వేల 170 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో 55, ఏపీలో 29 యాక్టివ్ కేసులు ఉండగా... కర్ణాటకలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. గత ఏడాది కాలంగా... కేసులు తగ్గిపోవడంతో.. ప్రజానీకం ఊపిరి పీల్చుకున్నారు. అయితే గత వారం రోజుల నుంచి కేరళ, తదితర రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు నమోదు కావడమే కాకుండా పలువురు మృతి చెందడంతో ప్రజలు మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News