సోనియా నేతృత్వంలో ఏఐసీసీ సమావేశం.. పార్టీ శ్రేణులను ప్రజా పోరాటానికి..

Update: 2019-11-16 05:13 GMT

సోనియా గాంధీ నేతృత్వంలో ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం జరగనున్నది. సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అన్ని రాష్ర్టాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు , పార్టీ అనుబంధ విభాగల అధ్యక్షులు సమావేశంలో పాల్గొననున్నారు. దేశంలో నెలకొన్న ఆర్ధిక మాంద్యం ఇతర అంశాలపై చర్చించనున్నారు.

అదే విధంగా మహారాష్ట్ర, హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సమీక్షంచనున్నారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఢిల్లీలో చేపట్టనన్న అంశాలపై చర్చించనున్నారు. పార్టీ శ్రేణులను సుదీర్ఘ ప్రజా పోరాటానికి సమాయత్తం చేసేందుకు కార్యాచరణ ఖరారు చేయనున్నారు. 

Tags: delhi, congress, sonia gandhi

Tags:    

Similar News