కాంగ్రెస్ సీనియర్ నాయకుడికి కరోనా పాజిటివ్..
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ ఝాకు కరోనావైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ ఝాకు కరోనావైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. అంతేకాదు ఈ విషయాన్నీ సంజయ్ ఝా స్వయంగా శుక్రవారం మధ్యాహ్నం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అందులో ఇలా పేర్కొన్నారు.. నేను కోవిడ్-19 భారిన పడ్డాను.. నాలో కరోనా లక్షణాలు కనిపించలేదు.. రాబోయే 10-12 రోజులు నేను హోం క్వారంటైన్లో ఉండబోతున్నాను.
కరోనా వ్యాప్తి లక్షణాలను తక్కువగా అంచనా వేయకండి. మనందరికి కరోనా ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి' అంటూ సంజయ్ ఝా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అయితే ఆయన ట్వీట్ కు స్పందించిన పలువురు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు సంజయ్ ఝా త్వరగా కోలుకోవాలని రీట్వీట్ చేశారు. కొద్ది నిమిషాల్లోనే కొన్ని వందల రీట్వీట్లు వచ్చాయి.