CJI NV Ramana: ప్రజల విశ్వాసం పొందేలా న్యాయస్థానాలు పనిచేయాలి..

CJI NV Ramana: ప్రజల విశ్వాసం పొందేలా న్యాయస్థానాలు పని చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు.

Update: 2021-06-26 16:15 GMT

CJI NV Ramana: ప్రజల విశ్వాసం పొందేలా న్యాయస్థానాలు పనిచేయాలి..

CJI NV Ramana: ప్రజల విశ్వాసం పొందేలా న్యాయస్థానాలు పని చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. సామాన్యులకు న్యాయాన్ని అందించడంలో ప్రతి ఒక్కరూ తమ తోడ్పాటు అందించాలని అన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ రాసిన ఎనామలీస్ ఇన్ లా అండ్ జస్టిస్ పుస్తకాన్నిజస్టిస్ రమణ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయస్థానాలపై సామాన్యులకు నమ్మకం పెరిగేలా అనేక విషయాలను జస్టిస్ రవీంద్రన్ తన పుస్తకంలో ప్రస్తావించారని తెలిపారు. న్యాయశాస్త్రంలో ఉన్న లోపాలు సరి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందనే విషయాలను ప్రస్తావించారని జస్టిస్‌ రమణ చెప్పారు.

Tags:    

Similar News