Mumbai: శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ముంబయిలో చీటింగ్ కేసు

Mumbai: కుంద్రా దంపతులపై ఫిర్యాదు చేసిన పూణే యువకుడు

Update: 2021-11-14 14:07 GMT

రాజ్ కుంద్రా మరియు శిల్ప శెట్టి పై చీటింగ్ కేసు నమోదు (ఫైల్ ఇమేజ్)

Mumbai: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాను వివాదాలు, కేసులు వీడడం లేదు. తాజాగా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలతో పాటు ఎస్ఎఫ్ఎల్ ఫిట్ నెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కాషీఫ్ ఖాన్ లపై ముంబయిలో చీటింగ్ కేసు నమోదు చేశారు.

తనను 1.51 కోట్ల మేర మోసం చేశారంటూ పూణేకు చెందిన యశ్ నితిన్ బరాయ్ అనే యువకుడు ఫిర్యాదు చేయడంతో ముంబయిలోని బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడికి చెందిన స్థలంలో ఫిట్ నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకునేందుకు తాము ఫ్రాంచైజీ ఇస్తామని మోసం చేసినట్లు తెలిపాడు.

Tags:    

Similar News