చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగవేదిక చంద్రయాన్-2 ప్రయోగించనున్నారు. ఇస్రో బాహుబలి రాకెట్గా పేరుగాంచిన జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఈనెల 15వతేదీన ప్రయోగించాలనుకున్న చంద్రయాన్–2ను చివరి గంటలో రాకెట్లో మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిపివేశారు. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి.. వారం తిరగక ముందే సాంకేతిక లోపాన్ని సవరించి ప్రయోగానికి సిద్ధం చేశారు.