రైళ్లు నడుస్తాయంటూ వస్తున్న వార్తలు అసత్యం
కరోనా నియంత్రణ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కరోనా నియంత్రణ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నెల 14తో లాక్డౌన్ ముగియనుంది. 15వ తేదీ నుంచి రైలు ప్రయాణాలకు సంబంధించి రైల్వేశాఖ రిజర్వేషన్లను ప్రారంభించిందని వస్తున్న వార్తలపై రైల్వే మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.
కొన్ని మీడియా సంస్థల్లో రిజర్వేషన్ల ప్రారంభ తేదీలు అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని తెలిపింది. ఇలాంటి వార్తలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తాయని తెలిపింది. రైలు ప్రయాణాలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తక్షణమే రైల్వేశాఖ తెలియజేస్తుందని ప్రకటనలో వెల్లడించింది.
ఏదైనా ప్రసారం చేసేప్పుడు సంబంధిత వర్గాల నుంచి అధికారికంగా తెలుసుకొని ప్రసారం చేయాలని తెలిపింది. లాక్డౌన్ పొడిగింపుపై శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోది శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించబోతున్నారు.