యూకేకు విమాన సర్వీసుల పునరుద్ధరణకు కేంద్రం నిర్ణయం

ఈనెల 8 నుంచి జనవరి 23వరకు వారానికి 15 విమానాలు

Update: 2021-01-02 02:55 GMT

యూకేకు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8 నుంచి పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు షరుతులతో కూడిన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ వెల్లడించారు. జనవరి 23 వరకు వారానికి 15 విమానాలే ఇరు దేశాల మధ్య సేవలందించేందుకు అనుమతించనున్నట్లు తెలిపారు. ఈ విమాన సర్వీసులు దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల నుంచి యూకేకు సేవలందిస్తాయని ట్విటర్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News