Rahul Gandhi: అసోంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు

Rahul Gandhi: కేంద్ర హోం మంత్రికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లేఖ

Update: 2024-01-25 04:00 GMT

Rahul Gandhi: అసోంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు  

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రపై అసోంలో కేసు నమోదైంది.. కాంగ్రెస్ కార్యకర్తలు గువాహటి నగరంలోకి ప్రవేశించకుండా సరిహద్దుల వద్ద బారికేడ్లను ఏర్పాటుచేశారు. అయినప్పటికీ దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేశారు. అయితే.. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రికి ఖర్గే లేఖ రాశారు. రాహుల్ యాత్రకు సంబంధించి.. భద్రత కల్పించడంలో.. అసోం పోలీసులు విఫలమయ్యారని.. ఖర్గే లేఖలో పేర్కొన్నారు. అయితే.. కేసును తాజాగా.. సీఐడీకి అప్పగిస్తూ.. అసోం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News