మధ్యప్రదేశ్లో జర్నలిస్టుపై పోలీస్ కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత కమల్నాథ్ మీడియా సమావేశానికి జర్నలిస్టులు హాజరయ్యారు. వీరిలో ఒక జర్నలిస్ట్ కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. లండన్ నుంచి తిరిగొచ్చిన కూతురు ఇంట్లో ఉండగా ఆ జర్నలిస్ట్ ప్రెస్మీట్కు హాజరయ్యారు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి ప్రెస్ మీట్ కు హాజరైన జర్నలిస్టుపై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ప్రెస్మీట్కు హాజరైన వారందరినీ క్వారంటైన్ కావాల్సిందిగా ఆదేశించారు.