శివభక్తులకు శుభవార్త.. అమర్నాథ్ యాత్ర రద్దు నిర్ణయం ఉపసంహరణ
కరోనా ఉద్ధృతి కారణంతో ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర రద్దు చేస్తూ.. శ్రీ అమర్నాథ్జీ ఆలయ బోర్డు (ఎస్ఏఎస్బీ) నిర్ణయం తీసుకుంది.
కరోనా ఉద్ధృతి కారణంతో ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర రద్దు చేస్తూ.. శ్రీ అమర్నాథ్జీ ఆలయ బోర్డు (ఎస్ఏఎస్బీ) నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం. మొత్తం 42 రోజుల పాటు సాగే ఈ ఏడాది జూన్ 23 నుంచి ఆగస్టు 3 వరకు అమర్నాథ్ జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో దాన్ని రద్దు చేస్తున్నట్లు.. పూజలు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటన విడుదల చేసి.. ఆ వెంటనే దాన్ని ఉపసంహరించుకున్నారు.
అంతకుముందు జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, ఎస్ఏఎస్బీ ఛైర్మన్ గిరీష్ చంద్ర ముర్ము అధ్యక్షతన 38వ బోర్డు సమావేశం జరిగింది. కరోనా వైరస్ ప్రభావంతో అమర్నాథ్ యాత్ర నిర్వహణపై బోర్డు సభ్యులు చర్చలు జరిపారు. కశ్మీర్లో అమర్నాథ్ యాత్ర సాగే మార్గాల్లో 77 కరోనా రెడ్ జోన్లు ఉన్నాయని భక్తులను యాత్రకు అనుమతి ఇస్తే కరోనా వైరస్ బారినపడే ప్రమాదముందని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో మంచు తొలగించడం,క్యాంపుల నిర్వహణ, భక్తులకు వైద్య సదుపాయాలు వంటివి కల్పించలేమనీ అభిప్రాపడ్డారు. ఈ నేపథ్యంలోనే యాత్రను ఈ ఏడాది రద్దుచేస్తున్నట్లు ఏకగ్రీవంగా బోర్డు తీర్మానం చేసింది. పరమశివుడు భక్తుల అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ గరీష్ చంద్ర ముర్ము తెలిపారు.
అయితే అమర్నాథ్ పూజలు అగవని, గుహలోనీ జ్యోతిర్లింగానికి పూజ, సంపన్న్ పూజ మాత్రం సంప్రదాయబద్ధంగా కొనసాగుతాయి అని తెలిపారు. మంచులింగ దర్శనాన్ని శివ భక్తుల కోసం ఆన్లైన్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించడంపై SASB పరిశీలిస్తోందని గిరీష్ చంద్ర తెలిపారు. యాత్ర రద్దు నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.