కేఫ్ కాఫీ డే ఓనర్ సిద్ధార్థ మిస్?

Update: 2019-07-30 04:55 GMT

ప్రముఖ కేఫ్ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ సోమవారం రాత్రి నుంచి కనిపించడం లేదని తెలుస్తోంది. ఈయన కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ అల్లుడు. మంగళూరు సమీపంలోని ఉల్లాల్ బ్రిడ్జి వద్దకు నిన్న రాత్రి ఆయన తన ఇన్నోవా కారులో వెళ్ళారు. బ్రిడ్జి పై సగం దూరం వెళ్ళాకా కారు ఆపుచేసి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లినట్టు తెలిసింది.

కారులో వెళుతున్న సమయంలో డ్రైవర్ ను కారు అపుచేయమని చెప్పిన సిద్ధార్థ, కారును ముందుకు పోనీయమని, తాను నడుచుకుంటూ వస్తాననీ చెప్పారు. డ్రైవర్ కొంచెం ముందుకు వెళ్లి కారు ఆపుచేసి కొంత సేపు ఎదురు చూశాడు. సిద్ధార్థ ఎంతకీ రాకపోయే సరికి అయనకి ఫోన్ చేశాడు. అయితే, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వెంటనే పోలీసులు రంగం లోకి దిగారు. బ్రిడ్జి ఉన్న నేత్రావతీ నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఈ విషయంపై మాట్లాడుతూ '' నిన్న బెంగళూరులో అయన బయలుదేరినపుడు డ్రైవర్ కి సక్లేష్ పుర వెళ్లాలని చెప్పారు. దారిలో అయన కారుని మంగుళూరు వైపు పోనీయమని చెప్పారు. మార్గ మధ్యలో నేత్రావతి బ్రిడ్జి వద్ద దిగారు. తరువాత కనిపించకుండా పోయారు. స్థానిక జాలర్ల సహాయంతో అయన జాడ కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే ఆయన చివరిగా ఎవరితో మాట్లాడారనే దానిపై ఆరా తీస్తున్నాం'' అని చెప్పారు.



Tags:    

Similar News