ఇస్లామియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత.. కాల్పులు జరిపిన అగంతకుడు

Update: 2020-01-30 10:18 GMT
ఇస్లామియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత

ఢిల్లీ జామియా ఇస్లామియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీలో ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఓ విద్యార్థి గాయపడ్డాడు.

జామియా క్యాంప్‌ నుంచి రాజ్‌ఘాట్‌ వరకు విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో నల్లటి కోటు ధరించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి తుపాకీ బయటకు తీసి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి బుల్లెట్‌ గాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం కాల్పులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా సమయంలో భారీగా పోలీసులు సైతం అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News