KCR: కేవలం ఒక్క బటన్ నొక్కండి.. దేశమంతా మారిపోతుంది
KCR: వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించండి
KCR: వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో మరాఠా ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపించాలని కేసీఆర్ సూచించారు. కేవలం ఒక్క బటన్ నొక్కండి దేశమంతా మారిపోతోందన్నారు. మహారాష్ట్రలో అనేక సమస్యలున్నాయని, అవన్నీ పరిష్కారం కావాలన్నారు. తన మాటల్లో నిజం ఉందని గులాబీ జెండా భుజాన వేసుకుని కదలిరండని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ఊరురా కిసాన్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం కేసీఆర్.