కోటి ఆశలతో పుట్టినింటి నుంచి మెట్టినింటికి అడుగుపెట్టిన నవవధువు.. భర్త చేసిన మోసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. మైసూరు నగరం ఆనంద నగరకు చెందిన భావన (24)కు నెల క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అజయ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. దీంతో రాబోయే కొత్త జీవితాన్ని ఊహించికుంటూ మెట్టినింట అడుగుపెట్టింది భావన. అయితే పెళ్లికి ముందు నుంచే అజయ్ మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం భావనకు తెలిసింది. కానీ పెద్దలు సర్ది చెప్పడంతో మారినట్టు నటించాడు అజయ్..
అయితే ఈ క్రమంలో ఆ మహిళకు చెందిన ఫొటోలు అజయ్ మొబైల్లో కనిపించాయి, ఇద్దరూ నగ్నంగా ఉన్న ఫొటోలు కనిపించడంతో భావన అజయ్ను మరోసారి నిలదీసింది. వీరిద్దరూ ఇంకా కలిసి ఉన్నారని భావించి ఈ విషయాన్నీ మరోసారి కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం పెద్దలు ఇద్దరికి రెండో సారి రాజీ చేశారు. అయినా అజయ్ తీరులో మార్పు రాలేదు. దీంతో తీవ్రంగా మనోవేదన చెందిన భావన శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. commits