ఢిల్లీలో బోనాలు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారి దయతో దేశంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రకృతి కరుణించి మంచి వర్షాలు కురవాలని... పాడి పంటలతో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు.