Delhi: ఢిల్లీలోని రోహిణి కోర్టులో పేలుడు

Delhi: ఢిల్లీలోని రోహిణి కోర్టులో పేలుడు సంభవించింది.

Update: 2021-12-09 07:02 GMT

 ఢిల్లీలోని రోహిణి కోర్టులో పేలుడు (ఫైళ్లే-ఫోటో)

Delhi: ఢిల్లీ రోహిణి కోర్టులో మరోసారి పేలుడు కలకలం రేపింది. రూమ్ నంబర్ 102లో ల్యాప్‌టాప్ పేలినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ పేలుళ్లలో ఓ వ్యక్తి కాలికి గాయమైనట్లు వెల్లడించారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఏం జరిగిందో తెలియక కోర్టులో ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

గతంలోనూ ఇదే కోర్టులో కాల్పుల ఘటన కలకలం రేపింది. అయితే అప్పుడు ఓ నిందితుడిని హతమార్చడంలో భాగంగా కాల్పులు జరిగాయి. రూమ్ నెంబర్ 207లో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగితోపాటు మరో ముగ్గురు చనిపోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు గ్యాంగ్‌ల మధ్య విభేదాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. 

Tags:    

Similar News