BJP Meeting: ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

BJP Meeting: యూపీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాపై చర్చ

Update: 2022-01-13 06:01 GMT

ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

BJP Meeting: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. యూపీ ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఈ భేటీలో ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తొలి మూడు విడతలకు అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే యూపీ క్యాబినెట్ లోని ఇద్దరు మంత్రులతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో జాతీయ నాయకులు.. యూపీ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News