Bihar Results: బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే దూసుకెళ్తోంది – 170కు పైగా స్థానాల్లో ఆధిక్యం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యంతో ముందంజలో ఉంది. ఎగ్జిట్పోల్ అంచనాలకు అనుగుణంగా ఎన్డీయే దూకుడు కొనసాగుతోంది.
Bihar Results: బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే దూసుకెళ్తోంది – 170కు పైగా స్థానాల్లో ఆధిక్యం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యంతో ముందంజలో ఉంది. ఎగ్జిట్పోల్ అంచనాలకు అనుగుణంగా ఎన్డీయే దూకుడు కొనసాగుతోంది. తాజా ఫలితాల ధోరణి ప్రకారం ఎన్డీయే మ్యాజిక్ ఫిగర్ (122)ను దాటేసి 175 సీట్లలో ముందంజలో ఉంది. మరోవైపు మహాగఠ్బంధన్ కూటమి 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఎన్డీయేలో కీలక పార్టీలైన భాజపా, జేడీయూ చెరో 70కు పైగా సీట్లలో ఆధిక్యత సాధిస్తున్నాయి. ముఖ్యంగా జేడీయూ, భాజపాపై దూకుడు చూపిస్తోంది. విపక్ష మహాగఠ్బంధన్లో ప్రధాన పార్టీ అయిన ఆర్జేడీ 48 స్థానాల్లో ముందంజలో ఉంది. బిహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
కూటముల వారీగా పోటీ చేసిన స్థానాలు
ఎన్డీయే
జేడీయూ – 101
భాజపా – 101
లోక్ జన్శక్తి (రాంవిలాస్) – 28
హెచ్ఏఎం – 06
ఆర్ఎల్ఎం – 06
మఢౌరాలో లోక్జన్శక్తి (రాంవిలాస్) అభ్యర్థి సీమా సింగ్ నామినేషన్ తిరస్కరణతో, అక్కడ స్వతంత్ర అభ్యర్థి అంకిత్కుమార్కు ఎన్డీయే మద్దతు ప్రకటించింది.
మహాగఠ్బంధన్
ఆర్జేడీ – 143
కాంగ్రెస్ – 61
సీపీఐ(ఎంఎల్)ఎల్ – 20
వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ – 12
సీపీఐ – 09
సీపీఎం – 04
ఇండియన్ ఇన్క్లూజివ్ పార్టీ – 03
జనశక్తి జనతాదళ్ – 01
స్వతంత్రులు – 02
(కొన్ని చోట్ల స్నేహపూర్వక పోటీ)
ఇతర పార్టీలు
జన్సురాజ్ (238), బీఎస్పీ (130), ఆప్ (121), ఏఐఎంఐఎం (25), రాష్ట్రీయ లోక్జనశక్తి (25), ఆజాద్ సమాజ్ పార్టీ (25) తదితర పార్టీలు బరిలో ఉన్నాయి.
పోలింగ్ వివరాలు
ఈసారి రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. రెండింటిలోనూ అత్యధిక ఓటింగ్ నమోదైంది.
మొదటి దశ (నవంబర్ 6)
సీట్లు: 121
ఓటర్లు: 3.75 కోట్లు
అభ్యర్థులు: 1,314
పోలింగ్ శాతం: 65%+
రెండో దశ (నవంబర్ 11)
సీట్లు: 122
ఓటర్లు: 3.70 కోట్లు
అభ్యర్థులు: 1,302
పోలింగ్ శాతం: 69%+
1951 తరువాత రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 67.13% పోలింగ్ నమోదై, ఫలితాలపై భారీ ఆసక్తి నెలకొంది.
కీలక నేతల స్థానాలు
తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ) – రాఘోపుర్
సామ్రాట్ చౌదరీ (భాజపా) – తారాపుర్
విజయ్ కుమార్ సిన్హా (భాజపా) – లఖిసరాయ్
మైథిలీ ఠాకుర్ (భాజపా) – అలీనగర్
ప్రమ్కుమార్ (భాజపా) – గయా టౌన్
తేజ్ప్రతాప్ యాదవ్ (జేజేడీ) – మహువా
బిజేంద్ర ప్రసాద్ యాదవ్ (జేడీయూ) – సుపౌల్
తార్కిశోర్ ప్రసాద్ (భాజపా) – కఠిహార్
రాజేశ్ కుమార్ (కాంగ్రెస్) – కుటుంబ