Bihar: బీహార్‌లో మళ్లీ తెరుచుకున్న కాలేజీలు

ఇవాల్టీ నుంచి రాష్ట్రంలో 11, 12 తరగతులకు క్లాస్‌లు.. ఆనందం వ్యక్తం చేసి విద్యార్ధులు థర్డ్ వేవ్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం హెచ్చరిక

Update: 2021-07-12 14:21 GMT

బీహార్‌లో తెరుచుకున్న కాలేజీలు (ఫైల్ ఫోటో)

Bihar: బీహార్‌లో మళ్లీ కాలేజీలు తెరుచుకున్నాయి. ఇవాల్టీ నుంచి ఆ రాష్ట్రంలో 11,12వ తరగతులకు క్లాస్‌‌లు ప్రారంభం అయ్యాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ కాలేజీకి రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. మిత్రులను కలుసుకుని ఆనందంలో తేలిపోయారు. సెల్పీలు దిగి సరదాగా గడిపారు. బీహర్‌లో కరోనా కేసులు తగ్గడంతో మళ్లీ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం నితిష్ కుమార్ స్పందించారు. కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికలతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News