కర్ణాటకలో ఇటివల బీజేపి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే .. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యడియూరప్ప భాద్యతలు స్వీకరించారు .అయితే ఈ సందర్భంగా ఆయనకి అభినందనలు తెలియజేసేందుకు బెంగళూరు మేయర్ గంగమ్బైక్ మల్లికార్జున్ పళ్లబోకేతో వచ్చారు. కానీ ఆమెకు బెంగళూరు నగర పాలక సంస్థ అధికారులు మాత్రం 500 రూపాయల ఫైన్ వేసారు . ఇక్కడ ఆమె చేసిన తప్పు ఏంటంటే ఆ పూలబోకే ప్లాస్టిక్ కవర్తో కప్పి ఉండడమే .. బెంగళూరు నగరపాలక సంస్థ 2016 లోనే పూర్తిగా ప్లాస్టిక్ను నిషేధించింది.