Ayodhya: అయోధ్యలో రామ్‌లీలా ప్రదర్శన

Ayodhya: కేవత్‌ పాత్రలో బీజేపీ ఎంపీ రవి కిషన్‌

Update: 2022-10-01 14:30 GMT

Ayodhya: అయోధ్యలో రామ్‌లీలా ప్రదర్శన

Ayodhya: రాముడి జన్మభూమి ఆయోధ్యలో ప్రదర్శిస్తున్న రామ్‌లీలా నాటకం ఐదోరోజుకు చేరుకుంది. తాజాగా ఐదో రోజు బీజేపీ ఎంపీ రవి కిషన్‌.. కేవత్‌ పాత్రలో నటించారు. ఇందులో సినీ కళాకారులు పలువురు అద్భుతంగా నటిస్తున్నారు. నాటకం ఆధ్యంతం ఆసక్తికరంగా సాగుతుండడంతో వేలాది మంది ప్రజలు తిలకించేందుకు తరలివస్తున్నారు. తాజాగా శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్లే సమయంలో గంగానది దాటడం, చిత్రకూట్‌లో శ్రీరాముడు, భరతుడు సమావేశాన్ని ప్రదర్శించారు. ఇందులో రాముడిగా రాహుల్‌ భుచార్‌, సీతామాతగా దీక్ష రైనా, కేవత్‌గా ఎంపీ రవికిషన్‌ నటించారు. ఇప్పటివరకు 2 లక్షల మేర మంది చూసినట్టు అయోధ్య రామ్‌లీలా కమిటీ అధ్యక్షుడు సుభాష్‌ మాలిక్‌ తెలిపారు. 

Tags:    

Similar News