మరింత విషమంగా జైట్లీ ఆరోగ్యం..ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న వైద్యులు
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. శుక్రవారం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందులు పడుతున్నారని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ను విడుదల చేయనున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఈనెల 9న జైట్లీ ఎయిమ్స్లో చేరగా.. 20వ తేదీ నుంచి వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నారు.