మరింత క్షీణించిన అరుణ్ జైట్లీ ఆరోగ్యం..లైఫ్ సపోర్ట్ పై చికిత్స చేస్తున్న వైద్యులు
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయనను లైఫ్ సపోర్ట్పై ఉంచినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రాన్ ఆక్సిజనేషన్ ను అమర్చినట్లు తెలిపారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వీటిని అమర్చారు. ఈనెల 9న అస్వస్థతకు గురికావడంతో జైట్లీని ఎయిమ్స్కు తరలించారు. నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు తెలియజేస్తున్నారు.